Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్.. ఓటు వేస్తే ఉచితగా దోసె
Lok Sabha elections 2024: లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. కంపెనీ ప్రవేశపెట్టిన "సవారీజిమ్మెదరికీ" కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్లను అందిస్తామని ప్రకటించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న 'VOTENOW' కోడ్ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్లను పొందవచ్చని రాపిడో తెలిపింది.Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్లను అందించడం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలి...