Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Ranchi

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!
Elections

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...
Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..
National

Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన "చేదు అవమానం" కారణంగా  JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు."ఢిల్లీ,  కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది" అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, "ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. "నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. అందుకే నేను బిజెపిలో చ...
ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..
Crime, National

ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..

ED raids in Jharkhand | జార్ఖండ్‌ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు సోమవారం అక‌స్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) ప‌లు పథకాల అమలులో అక్ర‌మాలు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమ‌వారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన‌ సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్ట...