Friday, January 23Thank you for visiting

Tag: PM modi

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

తాజా వార్తలు
Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం 'శ్రీ విజయ పురం'గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా Xపై ఒక పోస్ట్‌లో తాజా నిర్ణయాన్ని ప్రకటించారు "మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండ‌మాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక అని పేర్కొన్నారు.పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ స్థానం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగర...
Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

National
Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధుల‌కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వ‌ర్తింప‌జేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం అనుబంధ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆసుపత్రులలో ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత వైద్య‌సేవ‌ల‌ను అందిస్తుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు, మొత్తం ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుంది.ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, సీనియర్ సిటిజన్‌లు ప్ర‌భుత్వ అధికారిక‌ పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ద‌ర‌ఖాస్తును సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదం కోసం అధికారుల‌కు పంపుతుంది. అధికారులు ఆమోదించిన తర్వాత, హెల్త్‌...
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు

Trending News
Ajmer Sharif Dargah  | సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గా 4000 కిలోల శాకాహార విందును సిద్ధం చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, "సేవా పఖ్వాడా"తో కలిసి, అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ప్రఖ్యాత "బిగ్ షాహీ దేగ్"లో మరోసారి 4000 కిలోల శాకాహార "లంగర్" తయారు చేసి పంపిణీ చేయనున్నారు. "ఆహారం, 550 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది" అని దర్గా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు."ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని మతపరమైన ప్రదేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మేము 4,000 కిలోల శాఖాహారాన్ని సిద్ధం చేస్తాము. ఇందులో అన్నం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ పంపిణీ చేయడంతోపాటు మత పెద్ద‌లు, పేదలకు కూడా ఆహారాన్ని అంద‌జేస్తామ‌ని అధికారులు తెలిపారు. "ప్రధానమంత్రి మోదీ ప...
Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

తాజా వార్తలు
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. "70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు" అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మ...
Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

National, తాజా వార్తలు
Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్ర‌గ‌తిని పెంపొందించ‌డానికి పార్టీ అమ‌లు చేయ‌నున్న‌ ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావడానికి బిజెపి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివ‌రించారు."స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీల‌క‌మైన అంశంగా త‌మ పార్టీ భావిస్తోంది...
New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

National
New Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇది కీలక రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. కొత్త రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప‌లు రూట్లలో సేవలు అందిస్తాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్ విస్తరణలో మరో మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు:1. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2. మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 3. మీరట్ సిటీ నుంచి లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ Chennai Central to Nagercoil Vande Bharat Express: మొద‌ట చెన్నై సెంట్రల్ నుంచి వందేభార‌త్ రైలు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది చెన్నై ఎగ్మోర్ నుంచి బు...
New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు:మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం

Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం

Business
Industrial Smart Cities  | దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాల‌ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రూ. 1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9.39 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ల‌భించే అవకాశం ఉంది. 12 ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీలు.. Industrial Smart Cities  : అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. . ఈ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష...
Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Telangana
Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామిక ప‌రంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరా సంగ...
Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

National
Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌డ‌ఖ్ ను త్వ‌ర‌లో ఐదు జిల్లాలుగా విభ‌జించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై 'X' వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ల‌డ‌ఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభ‌జిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న‌ను చేరువ చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఇక్క‌డ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అట్టడు...