Friday, January 23Thank you for visiting

Tag: PM modi

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

National
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంట‌ల‌ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తుంది.జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్‌లో Z-మోర్హ్ టన్నెల్‌ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్‌ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను త‌ప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు ...
Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

Mary Millben | నా మ‌దిని దోచుకున్నారు.. మోదీపై అమెరిక‌న్ గాయ‌ని ఫిదా

National
American singer Mary Millben | భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (American singer Mary Millben) ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఢిల్లీలో నిర్వహించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలో ఏసు క్రీస్తును మోదీ (Prime Minister Narendra Modi) కీర్తించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతలో గురువుగా ఏసు పేర్కొన‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.లార్డ్ క్రైస్ట్ బోధనలూ ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని ఉటంకిస్తాయ‌ని, మనమందరం ఈ ఆత్మను బలపరిచేందుకు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమ‌ని ప్రధాని మోదీ పిలుపునివ్వ‌డంపై మేరీ మిల్బెన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ' మీకు కృత‌జ్ఞ‌త‌లు మోదీ గారూ.. ఏసు క్రీస్తు ప్రేమకు గొప్ప కానుక, ఆదర్శం. భారత బిషప్‌ల క్రిస్మస్ వేడుకలో నా రక్షకుడిని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి' అని ఆమె ట్వీట్ చేశారు. భ...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

National
One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Trending News
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా(Full list of Vande Bharat Express trains )20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్20833 - విశాఖపట్నం సికిం...
LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

Business, Career
LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు.LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు కూడా కొంత డబ్బు అందిస్తారు. మూడు సంవత్సరాల ...
పార్లమెంట్‌లో  విపక్షాల్లో చీలికలు మొదలు..

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

National
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...
Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Trending News
Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్ర...
యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

యూపీలో సీఎం యోగీ మార్క్‌.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

Elections
 UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్‌లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన‌ ఆర్‌ఎల్‌డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది.UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్‌డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓట‌ర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన 'బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింద‌ని పోల్‌స్టర్లు, విశ్లేషకులు భావిస్తున్...
అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

National
Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శర్మ ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. "100 సంవత్సరాల క్రితం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక కరీంగంజ్ జిల్లాను శ్రీభూమి - మాహాలక్ష్మి భూమిగా అభివర్ణించారు. ఈరోజు, అస్సాం మంత్రివర్గం మన ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది" అని ఆయన అన్నారు.జిల్లా పేరు మార్చడం జిల్లా ప్రజల ఆకాంక్షలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని శర్మ అన్నారు. డిక్షనరీ రిఫరెన్స్‌, ఇతర చారిత్రక ఆధారాలు లేని పేర్లను మారుస్తూనే ఉంటాం.. ఇది చాలా కాలంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం అన్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల...
Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు.బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు.పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...