
13 డిసెంబర్ 2001: 45 నిమిషాల బుల్లెట్ల వర్షం.. పార్లమెంట్పై ఉగ్రదాడి పూర్తి కథనం
ప్రజాస్వామ్య దేవాలయాన్ని వణికించిన రోజు9 మంది వీర సైనికుల అమరత్వంకుట్రలో భాగమైన అఫ్జల్ గురుకు మరణశిక్ష.2001 Parliament Attack | డిసెంబర్ 13, 2001. సరిగ్గా 24 ఏళ్ల క్రితం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజులలో ఒకటిగా నిలిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఐదుగురు పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కేవలం 45 నిమిషాల పాటు బుల్లెట్లతో విరుచుకుపడి, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దాడిలో 9 మంది వీర సైనికులు అమరులయ్యారు. దాడి జరిగిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ వెళ్లిపోయినప్పటికీ, 200 మందికి పైగా ఎంపీలు, మంత్రులు పార్లమెంట్ భవనం లోపలే ఉన్నారు.ఉగ్రదాడి ఎలా జరిగింది? (11:30 AM)ఉదయం 11:30 గంటల ప్రాంతంలో, ఉపరాష్ట్రపతి భద్రతా దళాలు ఆయన కోసం వేచి చూస్తుండగా, ఐదుగురు ఉగ్రవాదులు తెలుపు రంగు అంబాసిడర్ ...









