Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: National

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ
Elections, National

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...
Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….
Trending News

Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….

Know Your Candidate app | లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు  'నో యువర్ క్యాండిడేట్' (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  ప్రకటించారు. ఈ యాప్ ఓటర్లకు వారి  నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న  అభ్యర్థుల నేర చరిత్ర,  ​​ఆస్తులు,  అప్పుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.  తమ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల నేర చరిత్ర, వారి ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సీఈసీ పేర్కొంది. KYC యాప్ తో ప్రయోజనాలు ఇవే.. Know Your Candidate (KYC) యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర పూర్వాపరాల గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడటానికి భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఈ యాప్యా  Android,  iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. KYC యాప్‌ని ఉపయోగి...
Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు..  ముస్లింలు ఎందుకు కాదు?  క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..
National, Trending News

Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Citizenship Amendment Act : పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ లో హింస‌కు గురువుతున్న ముస్లిమేత‌ర వ‌ర్గాల‌కు మాన‌వీయ కోణంలో భార‌త పౌర‌సత్వం క‌ల్పించేందుకు ఇటీవ‌ల‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో హింస‌కు గురైన మైనారిటీలకు పౌరసత్వం అందించడం CAA లక్ష్యం. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చుట్టూ అపోహ‌ల మ‌ధ్య హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం క్లారిటీ ఇచ్చారు.వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూల...
Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?
National

Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?

Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ముఖ్య‌మంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిలిచారు. ఎక్స్ (ట్విట‌ర్‌) ఖాతాలో దేశ‌వ్యాప్తంగా మిగ‌తా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక వీరిద్ద‌రి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు.భారత్ లో మోస్ట్‌ పాపులర్‌ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘ‌న‌తికెక్కారు. భారత్‌లో మిగ‌తా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను క‌లిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వా...
Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్..  అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..
National

Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు.బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న  కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. ఇంకా, కన్సాలిడేషన్ ఆఫీసర్ అవదేశ్ కుమార్ గుప్తా, అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ కుమార్‌లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.  యాదవ్, అఖిలేష్ కుమార్ పనిలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నితిన్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ విలేకరులతో అ...
ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్
Crime

ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది. ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే "నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని రాసి ఉంది. బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థల...