Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Nagpur

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్
National, తాజా వార్తలు

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగంనాగ్‌పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత క‌లిగిన‌ నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శనివారం నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో రచయితలు, హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ మార్పుల నేపథ్యంలో సాంస్కృతిక పరిరక్షణ, సమతుల్య జీవితం యొక్క ఆవశ్యకతను ఆయన వివ‌రించారు.AI కి మానవుడే మాస్టర్ కావాలిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరుగుదలతో మానవులు కేవలం 'యంత్రాలుగా' మారిపోకూడదని మోహన్ భగవత్ హెచ్చరించారు. "సాంకేతికతను ఆపలేం, కానీ అది తప్పనిసరిగా మానవాళి శ్రేయస్సుకు సేవ చేయాలి, మనం దాని యజమానులుగా ఉండాలి, దాని పరిమితులను నిర్దేశించాలి. మొబైల్ ఫోన్‌లను సాధనాలుగా ఉపయోగించాలి, అవి మనల్ని ఉపయోగించుకోనివ్వకూడదు," అని ఆయన అన్నారు.నిజ...
Nagpur Violence : నాగ్‌పూర్‌లోని మహల్, భల్దార్‌పురా, హంసపురిలో హింసకు కారణమేమిటి?
Crime

Nagpur Violence : నాగ్‌పూర్‌లోని మహల్, భల్దార్‌పురా, హంసపురిలో హింసకు కారణమేమిటి?

Nagpur Violence News Updates : నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు, విధ్వంసం, దహనకాండకు దారితీసింది. నిరసనతో ప్రారంభమైన ఘటనలు రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నేతలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి నిలయం, అందువల్ల శాంతిని కాపాడటానికి ప్రభుత్వం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంటుంది.మహారాష్ట్ర (Maharastra)లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో ఉధృతం కావడంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలకు దారితీసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నాగ్‌పూర్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కర్...
Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?
National

Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?

Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను క‌నాల‌ని ఆయ‌న‌ సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ప్రసంగిస్తూ 1998 లేదా 2002 సంవత్సరంలో, భారతదేశ జనాభా విధానం ముసాయిదా రూపొందించింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 2.1 కంటే తగ్గకూడదని పేర్కొంది. సమాజం మనుగడకు జనాభా స్థిరత్వం చాలా అవసరం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, “జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయం. ఒక సంఘం జనాభా 2.1 సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ సమాజం అంతరించిపోతుందని ఆధునిక జనాభా అధ్యయనాలు సూచిస్తున్నాయి.""ఇది అదృశ్యం కావడానికి బ‌య‌టి శ‌క్తులు అవసరం లేదు, అది మ‌న కార‌ణంగానే అదృశ్యమవుతుంది. దీని వల్ల అనేక భాషలు,...
సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!
Telangana

సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!

Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్‌ స్టాప్‌ సమయంలో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండ‌గా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వ...
కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Telangana

కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Nagpur-Secunderabad Vande Bharat | నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవ‌లందించ‌నుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది.ఈ రైలు నాగ్‌పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. టైమ్‌టేబుల్‌లో స్వల్ప సర్దుబాట్లు ఉండవచ్చ‌ని గ‌మ‌నించాలి.ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. తగ్గనున్న ప్రయాణ సమయం ఈ కొత్త...
Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు
National

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్ల‌ను దారిమళ్లించింది. మ‌రో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది.ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్ర‌జ‌లు తమ రైళ్ల వివ‌రాల‌ను ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం. రాజ్‌నంద్‌గావ్ - నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమార...
 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి
Crime

 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అయితే. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రయాణికుడు CKD (Chronic kidney disease), క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు నాగ్‌పూర్‌లోని KIMS హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ DGM ఏజాజ్ షమీ తెలిపారు. అతని మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల...