
Lok Sabha Elections Phase 4 | నాలుగో దశ ఎన్నికలు.. 96 నియోజకవర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..
Lok Sabha Elections Phase 4 | లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరుసగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు దశల్లో పోలింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడత లోక్సభ ఎన్నికలు మే 13న సోమవారం జరగనున్నాయి. ఈ దఫా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు
ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగ...