Friday, August 1Thank you for visiting

Tag: lok sabha

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు

National
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 'ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా లేదా నేరుగా ఇచ్చిన మెమోరాండా ద్వారా అయినా, వాటన్నింటినీ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బిల్లుకూ ఇంత పెద్ద సంఖ్యలో పిటిషన్లు రాలేదు.Waqf : దిమ్మదిరిగిపోయేలా గణంకాలు..వక్ఫ్ ఆస్తి గురించి రిజిజు మాట్లాడుతూ, 'వక్ఫ్ బోర్డు (Waqf Board)కు లక్షల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉంటే, దానిని...
Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

National
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు.ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర...
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన  కేంద్రం.. త్వరలో JPCకి..

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

National
New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

National
One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Trending News
Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

National
Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా...
Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Special Stories
Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది.అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...
ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..

ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..

National
ADR Report | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల‌ల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల్లో 1,618 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు)లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.అయితే ADR Report ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 252 (16%) అభ్యర్థులలో, 161 (10%) వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నారు. అందులో, ఏడుగురు హత్యకు సంబంధించిన కేసులు, 18 మంది మహిళలపై అత్యాచారం వంట...
‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

National
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు.  తాజాగా రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.Naya Kashmir Bills జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు తగిన న్యాయం చేస్తాయన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47 కు పెంచినట్లు చెప్పారు.  అదేవిధంగా జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43 కు పెంచినట్లు వివరించారు.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) కూడా మనదేనని.. అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్‌ చే...