రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు!
DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై పరిశీలన చూసుకొని మరో డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యపై ఖర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామని చెప్పారు. .ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు సేకరించి డీఎస్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు చేపడతామని, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు (Group 1 Results) కూడా వెల్లడిస్తమని తెలిపారు.ఒక్కో నియోజక వర్గంలో రూ.100 -120 కోట్ల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థ...