
చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడుతెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై నేయడం ద్వారా తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫాబ్రిక్ పై భారతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా చూపుతుంది. హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవు వస్త్రం పూర్తి చేయడానికి అతనికి వారం రోజులు పట్టింది. ఈ కళాఖండంలో PM మోడీ, హిందీ ఫాంట్లో అల్లిన 'నమస్తే' అని రాసి ఉన్నాయి. ప్రసాద్ తన కళాఖండాన్ని ప్రధానితో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.ఇదిలా ఉం...