Friday, April 18Welcome to Vandebhaarath

Tag: festive season

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు..  ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..
Trending News

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది.నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways new record మంత్రిత్వ శాఖ ప్రకారం, షెడ్యూల్డ్ రైళ్ల ద...
Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే
Trending News

Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే

Festive Season | రైళ్ల‌లో టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝ‌ల‌క్ ఇవ్వ‌నుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృత‌స్థాయిలో మోహ‌రించ‌నుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్ర‌కారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.పండుగ రద్దీ నేప‌థ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా త‌నిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున...
Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌ల పెంపు
National

Diwali Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి నేపథ్యంలో రైల్వే కోచ్‌ల పెంపు

రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్‌ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్‌ పూజ (Chhath Puja) పండుగ‌ల స‌మీపిస్తున్న క్ర‌మంలో రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకి అనుగుణంగా అద‌నంగా 12,500 కోచ్‌లను (12,500 Additional Coaches) రైళ్ల‌కు జత చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి వైష్ణ‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ పండుగ సీజన్‌లో (festive season) 108 రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను పెంచామ‌ని, ఛఠ్‌ పూజ, దీపావళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచ్‌లు అదనంగా జత చేశామ‌ని తెలిపారు. 2024-25లో పండగ వేళల్లో ఇప్పటి వరకూ మొత్తం 5,975 ప్ర‌త్యేక‌ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించామ‌ని, ఈ నిర్ణయం దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు పండుగ‌ల స‌మ‌యాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుల‌భంగా ప్ర‌యాణాలు సాగిం...