
Liquor Scam | లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్.. మొత్తం 171 ఫోన్లు మాయమయ్యాయన్న ఈడీ
Liquor Scam | న్యూఢిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండేళ్ల క్రితం మద్యం కుంభకోణం జరిగిన సమయంలో ఉపయోగించిన ఫోన్ కనిపించకుండా పోయిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. దీనిపై కేజ్రివాల్ ను ప్రశ్నించగా, అది ఎక్కడ ఉందో తనకు తెలియదని చెప్పారని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇది 171వ ఫోన్ అని తెలిపారు. ఆ ఫోన్ లో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన డేటాను ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 36 మంది నిందితులకు చెందిన 170 ఫోన్లను గుర్తించలేకపోయామని ఈడీ పేర్కొంది.
చివరికి, ఏజెన్సీ వారు 17 ఫోన్లను గుర్తించి డేటాను రికవరీ చేసింది. ED తన ఛార్జిషీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు గాను మిగిలిన ఫోన్లను పగలగొట్టారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఇప్పటి వరకు, ఫోన్లు ల్యాప్టాప్లలో ఈ కేసుకు సం...