
Rythu runa Mafi | రైతులకు శుభవార్త.. రుణ మాఫీపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. దీంతో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఇటీవల లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. తాజాగా ఉపముఖ్యమత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi ) ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమలుపై కూడా చర్చలు జరుగుతున్నాయని రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? అన్నది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని, విధివిధానాల...