
రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా
ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్
పంజాబ్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో కాజేయాలని ప్లాన్ చేశాడు..
ఇందుకోసం తాను చనిపోయినట్లు సీన్ చేసేందుకు తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి కుట్ర పన్నాడు. తమ ప్లాన్ అమలు కోసం ఓ అమాయకుడిని హత్యచేశారు. చివరకు వీరి మాస్టర్ ప్లాన్ ను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ కేసుకు సంబంధించి ఫతేఘర్ సాహిబ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) డాక్టర్ రవ్జోత్ కౌర్ గ్రేవాల్ వివరాలు వెల్లడించారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గుర్ప్రీత్ సింగ్ తన ఫుడ్ చైన్ ఫ్రాంచైజీ వ్యాపారంలో నష్టాలు వచ్చి భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, జీవిత బీమా, ప్రమాద బీమాను క్లె...