Friday, January 23Thank you for visiting

Tag: bjp

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...
Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...
Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం..  నేడే షెడ్యూల్ విడుదల

Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. నేడే షెడ్యూల్ విడుదల

Elections
Maharashtra and Jharkhand Assembly Elections | భారత ఎన్నికల సంఘం (Election Commission) ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూత్ తోపాటు కేరళలోని వాయనాడ్‌తో సహా మూడు లోక్‌సభలకు, వివిధ‌ రాష్ట్రాలలో కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. .కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఈ వేసవి లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి గెలుపొంద‌గా, కేర‌ళ‌ వయనాడ్ స్థానాన్నివ‌దులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎంపీగా కొన‌సాగుతున్నారు. అలాగే నాందేడ్ (మహారాష్ట్ర), బసిర్హట్ (పశ్చిమ బెంగాల్) రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 26, జనవరి 5న అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ...
Secunderabad : ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

Secunderabad : ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

Crime
Secunderabad : సికింద్రాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయం (Muthyalama temple) లో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయం నుంచి పెద్ద శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. ఉదయం నుంచి గుడి దగ్గర గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు.. అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా ముత్యాలమ్మ గుడి (Muthyalama temple) పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఒక‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ‌ ఇచ్చిన సమాచార...
హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్

హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్

Elections
Assembly Election Results | ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని తాజా ట్రెండ్‌ల ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) అధికార బీజేపీ 45 సగం మార్కును దాటింది. ఇప్పుడు 49 స్థానాల్లో కాషాయ ద‌ళం ఆధిక్యంలో ఉంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీవీ చానెళ్లలో అందుబాటులో ఉన్న తొలి ట్రెండ్‌లు బీజేపీ కంటే కాంగ్రెస్‌ ముందున్నాయని సూచించ‌గా, ఆ తర్వాత అధిష్ఠానం వేగంగా పుంజుకుంది. ఉదయం 10.20 గంటలకు అందుబాటులో ఉన్న EC ట్రెండ్స్ ప్రకారం, బిజెపి 48 స్థానాల్లో మరియు కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 46. బీజేపీ గెలిస్తే.. హర్యానా సీఎం ఎవరు? నయాబ్ సింగ్ సైనీనయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్ర‌ముఖ రాజ...
Haryana Exit Poll Results |  హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Elections
Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు.రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్కాంగ్రెస్: 55-62 సీట్లు BJP: 18-24 సీట్లుపీపుల్ పల్స్ పోల్ సర్వేకాంగ్రెస్: 44-54 సీట్లు BJP: 15-29 సీట్లు ఇతరులు: 4-9 సీట్లుదైనిక్ భాస్కర్ పోల్ సర్వే...
Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Elections
Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సార‌మ‌వుతాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎప్పుడు ఎక్కడ‌? యాక్సిస్ మై ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి హర్యానా, J&K ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తుంది. జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, CSDS, C ఓటర్స్‌తో సహా ఇతర పోల్‌స్టర్‌లు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా ఎన్నికల్లో విజేతలను అంచనా వేయడ...
జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

జ‌మిలీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. వచ్చే పార్ల‌మెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

National
One Nation One Election | దేశ‌వ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను నిర్వ‌హించేందుకు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు మోదీ-కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జ‌మిలీ ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిషన్ ఈ ప్లాన్ ను ఆమోదించడంతో ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జ‌మిటీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలోనే త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు జ‌మిలీ ఎన్నిక‌లే స‌రైన ప‌రిష్కార‌మ‌ని వివ‌రించారు.ప్రస్తుత ఎన్డీయే ప్ర‌భుత్వ‌ హయాంలోనే జమిలి ఎన్నికలు అ...
Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్

Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్

Trending News
Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి  నలుగురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ల చేతికి జెండా ఎలా వచ్చింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా  అలా చేయమని ప్రోత్సహించారానే కోణంలో దర్యాప్తు చేపట్టారు.ద్విచక్రవాహనంపై   వెనుక కూర్చున్న వ్యక్తి  పాలస్తీనా జెండా పట్టుకుని కనిపించడంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్‌దళ్‌, భాజపా కార్యకర్తలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగి నిందితులను వెంటన...
One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

తాజా వార్తలు
One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం వంద రోజుల పాల‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్ర‌స్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌ని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది....