
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం: విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar plane crash news | ముంబై : భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గం బారామతికి చార్టర్డ్ విమానంలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం ఎలా జరిగింది?అధికారిక సమాచారం ప్రకారం.. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతిలో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. భూమిని తాకిన వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో అది రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఐదుగురు (అజిత్ పవార్, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించినట్లు డీజీసీఏ (DGCA) ధృవీకరించింది.రాజకీయ ప్రస్థానం - మహారాష్ట్ర 'దాదా'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గం అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మహారాష్ట్రలో అత్యధిక క...


