Friday, January 23Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

Special Stories
Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. ఈ ఏడాది 24 అక్టోబరు 2023న జరుపుకుంటారు. హిందువులు దసరా పండగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుడి మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం 10వ రోజున రాముడు రావణుడిని వధించి సీతను అతడి బారి నుంచి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతోనే దేశవ్యాప్తంగా...
ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?

ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?

Special Stories
India-Israel relations: భారత దేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను  కార్గిల్ యుద్ధ సమయంలో ఎదుర్కొంది.  మే 3, 1999న, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్-ద్రాస్ సెక్టార్‌లో పాకిస్తానీ దళాల చొరబాటు గురించి భారతదేశానికి తెలిసింది. మూడు వారాల తర్వాత, ఆపరేషన్ విజయ్ అనే కోడ్ పేరుతో మనదేశం ఎదురుదాడిని ప్రారంభించబడింది. అయితే, కాలం చెల్లిన సైనిక, సాంకేతిక పరికరాలు కలిగిన భారత రక్షణ దళాలకు వ్యూహాత్మక ప్రదేశాల్లోని బంకర్లలో దాక్కున్న పాకిస్తానీ సైనికులను గుర్తించడం.. వారిపై దాడి చేయడం  చాలా కష్టంగా మారింది.సహాయం కోసం భారత్  అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే 1998లో అణ్వాయుధ పరీక్షలు చేపట్టిన కారణంగా అమెరికా నేతృత్వంలోని దేశాలతో సాంకేతిక, ఆర్థిక, ఆయుధాలకు సంబంధించి  మన దేశం ఆంక్షలను ఎదుర్కొంటోంది. అంతటి క్లిష్ట సమయంలో కేవలం ఒక్క దేశం మాత్రమే భారత్‌కు బహిరంగంగా మద్దతుగా నిలిచింది.. అదే ఇజ్రాయెల్(I...
సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

Special Stories
 పాపులర్‌ బ్రాండ్స్‌ అన్నీ వీక్.. న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి.మన దేశంలో కూడా భారత్‌ ఎన్ క్యాప్‌ (Bharat NCAP ) టెస్టింగ్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్‌ ఎన్ క్యాప్‌ తోనే టెస్టి...
ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

Special Stories
ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు.రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో  కూడిన...
vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

National, Special Stories
Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.. వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story) వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే.. లేదా వినాల్సిందే అంటున్నారు వేద పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజల్లో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.ఇప్పుడు కథలోకి వెళ్దాం.. పురాణాల ప్రకారం... తన భక్తుడైన ...
పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్

పరకాల అమరధామం : తెలంగాణలో జలియన్‌వాలాబాగ్

Special Stories
భారత్‌లో తెలంగాణ విలీనం కాకముందు అసలేం జరిగింది? తెలంగాణలోని పరకాలలో నిజాం పరిపాలన (hyderabad nizam) కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు ఇక్కడ మారణహోమానికి తెగబడ్డారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం లభించిన తర్కాత నిజాం రాజ్యంలోనూ జాతీయ పతాకం ఎగురవేసేందుకు అనేక యత్నాలు జరిగాయి. అయితే వాటిని అణగదొక్కేందుకు రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వీరోచిత పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా పరకాల(Parakala)లోని అమరధామం నిలుస్తుంది. పరకాల ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ (Telangana) ప్రాంతానికి మాత్రం రాలేదు. ఈ ప్రాతం నిజాం, రజాకార్ల ఆధీనంలోనే ఉంది. నిజాం నిరంకుశ పాల...
మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి

మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి

Special Stories
ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే  మీ ఇంట్లోనే మీరే స్వయంగా మ‌ట్టితో చక్కని గణపతి ప్రతిమను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్ర‌హాలు లభించనివారు  బాధపడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ విగ్ర‌హం తయారీ గురించి తెలుసుకుందామా.. ! మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు మట్టి, నీరు, రంగుల కోసం ప‌సుపు, కుంకుమ‌ మొదటి దశ:మీకు అందుబాటులో ఉండే ఏదైనా తోట మట్టిని తీసుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. అందులో రాళ్లను తొలగించండి. ఈ పొడి మట్టిని జల్లెడ పట్టండి. ...
పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

Special Stories
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ  సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి  వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం.కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా...
ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

Special Stories
ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ ఉపయోగించడానికి, మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు, మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా సినిమాలను స్ట్రీమింగ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు చాలానే ఉన్నాయని మీకు తెలుసా..? పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు రిజిస్ట్రేషన్ లేకు...
మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు

మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు

Special Stories
Top Sri Krishna Temples in India :  శ్రీకృష్ణుడు ప్రపంచంలోని గొప్ప తత్వవేత్త.. విష్ణువుని ఎనిమిదో అవతార పురుషుడు. ప్రపంచమంతా ఆయనను భక్తి ఆరాధనతో పూజిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణ దేవాలయాలు ఆధ్యాత్మిక పరిమళలాలను ఇనుమడింపజేస్తున్నాయి. భారతదేశం అద్భుతమైన శిల్పకళా వైభవంతో అనేక అందమైన కృష్ణ దేవాలయాలకు నిలయం. శ్రీకృష్ణుని ఆలయాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి. ఇస్కాన్ టెంపుల్, బృందావన్, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరమైన బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON )  ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన కృష్ణ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, రాధ కొలువుదీరి నిత్యం పూజలందుకుంటారు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలతో పాటు ప...