Thursday, June 19Thank you for visiting

Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Spread the love

sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత కల్పించారు. ప్రస్తుతం విగ్రహాలను భద్రపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే తెరిచిన ఆలయంలో భ‌క్తుల‌ దర్శనం, పూజల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబరు 14న అధికారులు తెరిచిన శివాలయం సమీపంలోని బావిలో అనేక హిందూ దేవుళ్ల విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంభాల్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆక్రమణ‌లో ఉన్న ఆల‌యాల‌ను గుర్తించేందుకు ప్ర‌త్యేక‌ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఆక్రమణకు గురైన ప్రాంతాలు ఎక్కువ‌ మసీదులు, కిక్కిరిసిన ఇండ్లు క‌లిగిన‌ కాలనీలతో అధిక జనాభాకు అలవాటు పడ్డాయి. ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో విచ్చలవిడిగా విద్యుత్‌ చౌర్యం కూడా జరుగుతుండడంతో వాటిని తొలగించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ సమయంలో శివ -హనుమాన్ దేవాలయం కూడా కనుగొన్నారు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..