Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..

Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్ల‌ర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..

Pune Porsche crash news | కొద్ది రోజుల క్రితం పూణెలో ఓ ధ‌నిక కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు తన పోర్షే కారుతో బైక్ ను ఢీకొట్టి ఇద్దరు యువ టెక్కీల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న తీవ్ర సంచలనం రేపింది.. అయితే వరుస షాకింగ్ ట్విస్ట్ లతో ఈ కేసు దేశవ్యాప్తంగా  దుమారం రేపింది. అన్యాయంగా ఇద్దరు యువ‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌ను పొట్ట‌న పెట్టుకోవ‌డ‌మే కాకుండా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం, కేసు నుంచి త‌ప్పించుకునేందుకు రక్త నమూనాలను మార్చుకోవడం.. అండర్ వరల్డ్‌తో సంబంధాలు, పోలీసులు, వైద్యులు అవినీతికి పాల్పడడం.. వంటి అనేక కీలక మలుపులతో ఈ కేసును ఒక సీరియ‌స్ థ్రిల్ల‌ర్‌ క్రైమ్ వెబ్ సిరీస్‌గా మార్చాయి. ఈ కేసులో ప్రతి రోజూ ఒక కొత్త ఆసక్తికరమైన వాస్తవం తెరపైకి వస్తోంది.

మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ సంచ‌ల‌న‌ కేసు పోర్షే కారు న‌డిపిన 17 ఏళ్ల యువకుడి తండ్రి అయిన‌ ఉన్నత స్థాయి రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ కుటుంబం మొత్తాన్ని చుట్టుకుంది. వైద్యులు, పోలీసు అధికారులు , రాజకీయ నాయకులు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి తన కొడుకును త‌ప్పించే య‌త్నం చేసిన యువకుడి తండ్రిని పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేశారు. అలాగే అతని తాతను కటకటాల వెనక్కి పంపారు. అయితే కొడుకు ర‌క్త న‌మూనాకు బదులు అత‌డి త‌ల్లి త‌న ర‌క్త‌న‌మూనాను ఇచ్చినందుకు ఆమెను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది. .

Pune Porsche crash news : ట్విస్టుల మీద ట్విస్టులు

24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోష్ట మే 19న డిన్నర్‌కి వెళ్లారు. కానీ అదే వారి చివ‌రి విందు అవుతుంద‌ని కలలో కూడా ఊహించ‌లేదు. రాత్రి భోజనం చేసి, పూణెలోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా వేగంగా వస్తున్న గ్రే కలర్ పోర్షే కారు వీరి బైక్‌ను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశ్విని కోష్ట‌ అక్కడికక్కడే మృతి చెందగా, అవధియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందినవారు.

READ MORE  Mahalakshmi scheme | రాహుల్ గాంధీ రూ.లక్ష ప్ర‌క‌ట‌నతో ఖాతాలు తెరిచేందుకు పోటెత్తిన మ‌హిళ‌లు

కారులో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అదే లగ్జరీ వాహనంలో యువకుడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. యాక్సిడెంట్ జ‌రిగిన‌పుడు ఇరుగుపొరుగు వారు వ‌చ్చి యువకుడిని చిత‌క‌బాదారు.. అప్ప‌టికే బాగా తాగి ఉన్నాడు.. అయితే కొన్ని నిమిషాల‌ వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక్క‌డే షాకింగ్ ట్విస్ట్ జ‌రిగింది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే జువైనల్ జస్టిస్ బోర్డ్ (జేజేబీ) బెయిల్‌పై ఆ యువకుడిని విడుదల చేసింది. ఇద్ద‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వ్య‌క్తికి వెంట‌నే బెయిల్ మంజూరు చేయ‌డంపై దేశవ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. అతడికి శిక్ష కేవలం రోడ్డు ప్రమాదాలు – వాటి పరిష్కారంపై 300 పదాల వ్యాసం రాయాల‌ని ఆదేశించ‌డంలో అంద‌రూ మండిప‌డ్డారు.

ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పూణేలో మరణించిన వారి కోసం అంద‌రూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ప్రమాదానికి ముందు యువకుడు, అతని స్నేహితులు రెండు బార్‌లలో మద్యం సేవిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి ఆజ్యం పోసిన‌ట్లైంది. 69 వేల విలువైన మద్యం బిల్లులు చెల్లించారు. మైనర్లకు మద్యం అందిస్తున్నందుకు పబ్‌ల‌లోని ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేశారు రెండు ప‌బ్ ల‌ను సీలు చేశారు.

యువకుడికి ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక చికిత్స అందించారని, పిజ్జా, బర్గర్‌లు ఆర్డ‌ర్ చేశార‌ని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే పుణె పోలీసు కమిషనర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సునీల్ టింగ్రే కూడా అర్థరాత్రి పోలీసు స్టేషన్‌ను సందర్శించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే, టింగ్రే పోలీసులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఖండించారు. తాను “బాధ్యతగల ప్రజా ప్రతినిధి”గా పోలీస్ స్టేషన్‌ను సందర్శించానని చెప్పారు..

READ MORE  215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

చివరకు మైనర్ బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. ఇది ఘోరమైన నేరం కాబట్టి నిందితుడిని పెద్దవారిగా పరిగణించాలని పోలీసులు కోరుతున్నారు.

పోలీసులను తప్పించుకున్న యువకుడి తండ్రి అరెస్ట్

ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ యువకుడి తండ్రి, బ్రహ్మ రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యజమాని విశాల్ అగర్వాల్ ప‌రార‌య్యాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న అగర్వాల్ తన డ్రైవర్, ఆయ‌న వాడుతున్న కారును ముంబై వైపు పంపించాడు. స్వయంగా తన స్నేహితుడి కారులో శంభాజీనగర్‌కు వెళ్లాడు.

అయితే, అతని స్నేహితుడి కారును జీపీఎస్ ద్వారా పోలీసులు అతడి కదలికలను గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా తన మైనర్ కుమారుడికి వాహనాన్ని అప్పగించినందుకు అగర్వాల్‌ను ఎట్ట‌కేల‌కు మే 21న ఓ లాడ్జిలో అరెస్టు చేశారు.

ప్రమాదంలో తమ కుటుంబ డ్రైవర్‌ హస్తం ఉందని యువకుడి తండ్రి ఆరోపించడంతో కేసుకు కొన్ని రోజుల తర్వాత స‌రికొత్త ట్విస్ట్‌ వచ్చింది. యువకుడి ఇద్దరు స్నేహితులు కూడా దీన్ని సమర్థించారు.

అయితే, సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడు తన నివాసం నుంచి వాహనాన్ని బయటకు తీశాడని పోలీసులు గుర్తించడంతో అగర్వాల్ ప్రయత్నం ఫలించలేదు. 18 ఏళ్లు నిండడానికి ఇంకా నాలుగు నెలలు నిండాల్సిన 17 ఏళ్ల బాలుడు పోర్స్చే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు “పూర్తి స్పృహలో” ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఫ్యామిలీ డ్రైవర్ వాంగ్మూలం..

ఈ కేసులో ఒక రోజు కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. మే 25న, యువకుడి తాత, సురేంద్ర అగర్వాల్ త‌న‌ను అన్యాయంగా నిర్బంధించి బెదిరించారని, ప్రమాదానికి తానే కారణమని చెప్పారని ఫ్యామిలి డ్రైవర్ ఆరోపించడంతో యువ‌కుడి తాత‌ను అరెస్టు చేశారు .

సురేంద్ర అగర్వాల్ తన డ్రైవర్‌ను గంగారామ్‌గా గుర్తించి అపహరించి బంగ్లాలో బంధించాడని, ప్రమాదానికి తానే కార‌ణ‌మ‌ని చెప్పాల‌ని అతనిపై ఒత్తిడి తెచ్చాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు చెల్లింపులు చేశారనే ఆరోపణలపై సురేంద్ర అగర్వాల్ కూడా షూటౌట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

అదే సమయంలో, ప్రమాద స్థలానికి చేరుకున్న తర్వాత కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వనందుకు ఎరవాడ పోలీస్ స్టేషన్‌లోని ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

READ MORE  Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ

ఇక్క‌డితో అయిపోలేదు.. ఈ కేసులో ప‌రిణామాలు ఇక్క‌డి నుంచి మ‌రింత సంక్లిష్టంగా మారింది చూడండి..

బ్లడ్ శాంపిల్స్ మార్చారు, డాక్టర్లు లంచం ఇచ్చారు..

మే 26న,  ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు యువకుడి రక్త నమూనాలు తీసుకోలేదని, రక్తంలో ఆల్కహాల్ స్థాయిని పలచన చేయడానికి ఇది జరిగిందా అనే ప్రశ్నలకు దారితీసింది.

మరుసటి రోజు, రక్త నమూనాలను తీసిన సాసూన్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను రక్త నమూనాలు, బ్ల‌డ్ రిపోర్డ్ ను తారుమారు చేసినందుకు అరెస్టు చేశారు. వైద్యులను ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న అజయ్ తవారే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హర్నోర్‌గా గుర్తించారు.

నిందితుడు మద్యం సేవించలేదని చూపించేందుకు యువకుడి రక్త నమూనాను వైద్యులలో ఒకరి రక్త నమూనాతో మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాలుడి రక్త నమూనాను డస్ట్‌బిన్‌లోకి విసిరినట్లు తెలిసింది.  రక్త నమూనాను తారుమారు చేసినందుకు వైద్యుల్లో ఒకరికి రూ.3 లక్షలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచం డబ్బును ఆసుపత్రి సిబ్బంది అతుల్ ఘట్‌కంబ్లే సేకరించారు, అతన్ని కూడా అరెస్టు చేశారు.

Pune Porsche crash news : కాగా, సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో మైనర్ బాలుడి రక్త నమూనాను అతని తల్లి శివాని అగర్వాల్‌తో మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదే ఇప్పటి కొత్త మలుపు తిరిగింది. పోలీసులు శివాని కోసం వెతుకుతున్నారు.  ఈ కేసులో త్వరలో ఏడవ అరెస్టుకు అవకాశం ఉంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *