National

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Spread the love

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు.

Highlights

తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు ల‌భిస్తున్నాయ‌ని తెలిపారు.

సోమవారం వడోదర(Vadodara)లో తాను ప్రారంభించిన ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఒక్కో విమానంలో 15,000 నుంచి 20,000 విడిభాగాలు ఉంటాయని, దీని వల్ల విడిభాగాల తయారీకి చిన్న కర్మాగారాలకు డిమాండ్ పెరుగుతుందని, తద్వారా ఉపాధి కల్పనకు దారితీస్తుందని ఆయన అన్నారు.

విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రభుత్వం కొత్త అవకాశాలను కల్పిస్తోందన్నారు. గత కొన్నేళ్లుగా భారతీయులకు వలసలు, ఉద్యోగాలకు సంబంధించి 21 దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు. ఇటీవల, జర్మనీ,, నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు ఇవ్వాల్సిన వీసాల సంఖ్యను సంవత్సరానికి 20,000 నుండి 90,000 కు పెంచింది. “భారతదేశ ప్రతిభ మ‌న దేశ పురోగతికి మాత్రమే కాకుండా ప్రపంచ పురోగతికి కూడా దిశానిర్దేశం చేస్తుంది” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *