Thursday, June 19Thank you for visiting

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

Spread the love

Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై ‘అదానీ, మోదీ ఒక్కటే’ అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.

మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ‘మోదీ జీ అదానీని విచారించలేరని, అలా చేస్తే అతనిపై కూడా విచారణ జరుగుతుందని అన్నారు. మోదీ, అదానీ ఒక్కటే. ఇద్దరు కాదు ఒక్కరు ఉన్నారు.

పార్లమెంటు సమావేశాన్ని అడ్డుకోవద్దు..

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నిర్వహణకు  ఆటంకం కలిగించారు.  విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్‌ హౌస్‌లోని ‘మకర్‌ గేట్‌’కు కొద్ది దూరంలోనే గుమిగూడి ప్రదర్శన చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభలో మాట్లాడుతూ సభ్యులు పార్లమెంటు ప్రవేశాన్ని అడ్డుకోవద్దని చెప్పారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..