Friday, April 18Welcome to Vandebhaarath

Operation brainwash: పాకిస్థాన్ లో స్నేహితుడిని కలిసేందుకు రాజస్థానీ బాలిక యత్నం

Spread the love

జైపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ‘ఆపరేషన్ బ్రెయిన్ వాష్’ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో భారత్ కు చెందిన అంజు వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, శుక్రవారం ఒక రాజస్థానీ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా జైపూర్ విమానాశ్రయంలో పట్టుబడింది.

17 ఏళ్ల బాలిక ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నంలో జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తొలుత పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మైనర్‌ టికెట్‌ అడగడంతో ఎయిర్‌పోర్టు సిబ్బందికి అనుమానం వచ్చింది. మొదట ఓ జోక్‌గా భావించారు. ఆ తర్వాత, తాను పాకిస్థాన్ జాతీయురాలినని, మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి అత్తతో కలిసి భారత్‌కు వచ్చానని బాలిక పోలీసులకు చెప్పింది. ఆమె సికార్ జిల్లాలోని శ్రీమాధోపూర్ ప్రాంతంలో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన అత్తతో గొడవపడి జైపూర్‌కు బస్సు ఎక్కింది.

READ MORE  Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

పోలీసుల విచారిస్తుండగా బాలిక ప్రయాణిస్తున్న బస్సులోనే తామూ ఉన్నామని ఇద్దరు కుర్రాళ్లు చెప్పారు. ప్రయాణంలో అమ్మాయి ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారు ఆమెను విమానాశ్రయంలో డ్రాప్ చేయడానికి వచ్చారు. తానది లాహోర్‌కు సమీపంలోని ఇస్లామాబాద్‌ అని బాలిక పోలీసులకు తెలిపింది.

అనంతరం బాలికను మహిళా పోలీసులు ప్రశ్నించారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో, బాలిక సికార్‌లోని శ్రీ మాధోపూర్‌కు చెందినదని తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లాహోర్‌కు చెందిన అస్లామ్ లాహోరీ అనే వ్యక్తితో అమ్మాయి స్నేహం చేసింది. ఏడాది కాలంగా వీరికి పరిచయం ఉంది. ఆ వ్యక్తి తన పాఠశాలలోని ఇతర బాలికలతో కూడా టచ్‌లో ఉన్నాడని ఆమె వెల్లడించింది.

READ MORE  water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

బాలికకు పాకిస్థానీ యువకుడే బ్రెయిన్ వాష్ చేసినట్లు తేలింది. ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ప్రవర్తించాలో అస్లాం సూచనలు అందించాడు. ఆమెకు పోలీసులకు ఎలాంటి సమాధానలు ఇవ్వాలో ను నేర్పించాడు.

పోలీసులు తనిఖీ నిమిత్తం బాలిక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె పాకిస్తాన్‌కు పారిపోవడానికి ప్రయత్నించిన విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియదు.ఆమె కుటుంబ సభ్యులకు కూడా మొత్తం ఎపిసోడ్ గురించి సమాచారం అందించారు. బాలిక చదువులో చాలా తెలివైనదని, ఇటీవలే 12వ తరగతి పాసైందని తెలిపారు. కాగా అమ్మాయి తండ్రి సైన్యంలో ఉన్నట్లు తెలిసింది.
ఈనేపథ్యంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ బాలికలు పాకిస్థానీ యువకుడితో ఎలా టచ్‌లోకి వచ్చారో పోలీసులు తెసుకునే పనిలో పడ్డారు.

READ MORE  జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *