Thursday, June 19Thank you for visiting

Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి

Spread the love

Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్‌ (Chandrabhan Paswan)ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది . అయోధ్య (Ayodhya ) సమీపంలో ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.

మిల్కీపూర్ ఉప ఎన్నిక (Milkipur by-election ) ఇప్పుడు బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని(Faizabad Lok Sabha constituency) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్( Awadhesh Prasad) గెలుచుకోవ‌డం కాషాయ పార్టీని చాలా ఇరుకున పెట్టింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ కుమారుడు అజిత్‌ ప్రసాద్‌ ( Ajit Prasad)ను ఎస్పీ బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యే ముందు అవధేష్ ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవధేష్ లోక్‌సభకు ఎన్నికైన తర్వాత మిల్కీపూర్ స్థానం ఖాళీ అయింది.

చంద్రభాన్ పాశ్వాన్ ఎవరు?

మరోవైపు మిల్కీపూర్ లో బిజెపి చంద్రభాన్ పాశ్వాన్ ను బ‌రిలో నిలిపింది. ఆయ‌న‌కు ఇదే మొట్ట‌మొద‌టి ఎన్నిక‌లు. కాగా మాజీ ఎమ్మెల్యేలు బాబా గోరఖ్‌నాథ్, రాము ప్రియదర్శి మినహా జిల్లా యూనిట్ పరిశీలనకు ప్రతిపాదించిన ముగ్గురిలో అతని పేరు ఉంది.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన చంద్రభాన్ పాశ్వాన్‌ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవాడు. అయోధ్యలోని పర్సౌలి గ్రామానికి ఆయ‌న 2022లో జరిగే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆయన టికెట్‌ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అతను గతంలో రుదౌలీ నుంచి జిల్లా పంచాయితీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. 2024 లోక్‌సభ ఎన్నికలలో అవధేష్ ప్రసాద్ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ మాజీ బిజెపి ఎంపి లల్లూ సింగ్‌కు సన్నిహితుడిగా చెబుతారు.

Milkipur bypoll : వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు

చంద్రభాన్ అభ్యర్థిత్వం కూడా నియోజకవర్గంలోని కుల స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వేసిన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లింద‌ని భావించ‌వ‌చ్చు. స్థానిక బిజెపి సర్కిల్‌లలో నిబద్ధత కలిగిన ‘కార్యకర్తగా గుర్తింపు పొందిన చంద్రభాన్, అంతర్గత సర్వే, పాసి ఓటర్లు అధికంగా ఉండటం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఆయ‌న‌కు ఈ అవ‌కాశం ద‌క్కింది.

మిల్కీపూర్‌లో దాదాపు 1.2 లక్షల మంది షెడ్యూల్డ్ కులాల ఓటర్లు ఉన్నారు. వీరిలో 70,000 మంది పాసి ఓటర్లు ఉన్నారు, మిగిలినవారిలో జాత‌వ్‌లు, ఇతర వర్గాలకు చెందినవారున్నారు. జాతవ్‌ల తర్వాత నియోజకవర్గంలో రెండవ అతిపెద్ద దళిత సమూహం పాసీలు, మాయావతి BSP ప్రభావం కోల్పోయినందున BJP వైపు వెళ్లారు. ఫైజాబాద్ ఓటమి తర్వాత, బీజేపీ కూడా పాసిలకు చేరువైంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స‌మాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థి అజిత్ కూడా పాసి కమ్యూనిటీకి చెందిన సభ్యుడిగా ఉన్నారు. దీని ఫలితం కొంతవరకు అగ్రవర్ణాల ఓట్లపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బిజెపికి మంచి అవకాశం ఉంది. పాసి ఓటు ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉన్నప్పటికీ, దళితులు, OBCల కంటే అగ్రవర్ణ ఓటర్ల మద్దతు కూడా అవ‌స‌ర‌మే..

మిల్కీపూర్‌లోని 3.7 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు, యాదవులు 60,000 మంది చొప్పున‌ ఓటర్లు ఉండగా, ఠాకూర్లు, ముస్లింలు ఒక్కొక్కరు 32,000 మంది ఓటర్లు ఉన్నారు. పాసీలు 70,000 ఓట్లను కలిగి ఉండగా, మిగిలిన‌వారిలో జాతవ్‌లు, ఇతర సంఘాలు ఉన్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..