Posted in

రూ.18,999కే 43 అంగుళాల QLED TV : జియోటెలీ OS తో కోడాక్ బడ్జెట్ బ్లాస్టర్

QLED TV
Spread the love

Kodak 43-inch QLED Smart TV న్యూఢిల్లీ : కోడాక్ టీవీ ఇటీవల జియోతో కలిసి పనిచేసి, తన మొట్టమొదటి జియోటెలి ఓఎస్-ఆధారిత స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 22 భారతీయ భాషలకు మద్దతుతో, ఇది భారతదేశ విభిన్న వినోద అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. AI కంటెంట్, ప్ర‌ధాన‌మైన‌ OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రాంతీయ ఛానెల్‌లు, గేమింగ్ కంటెంట్ ను అందిస్తుంది.

Kodak 43-inch QLED TV ధర, లభ్యత

జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన కోడాక్ కొత్త 43-అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.18,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ ఇండియా స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చు.

అద్భుతమైన డిస్ప్లే

43-అంగుళాల QLED 4K డిస్ప్లే స్మార్ట్ టీవీ 1.1 బిలియన్లకు పైగా రంగులు, HDR సపోర్ట్‌ తో స్పష్టమైన దృశ్యాలను అందిస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ సొగసైన, బెజెల్-లెస్ ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ఇది అమ్లాజిక్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 2GB RAMపై నడుస్తుంది. 8GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీలో 40W డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్లు అమర్చబడ్డాయి. ఇది మీ ఇంటికి సినిమా లాంటి సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఇంకా, కోడాక్ నుండి వచ్చిన QLED TV డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, వాయిస్-ఎనేబుల్డ్ మల్టీ-లాంగ్వేజ్ రిమోట్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 లకు కూడా ఉంటుంది. రిమోట్ లో YouTube, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లకు డెడికేటెడ్ షార్ట్‌కట్ కీస్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ హెడ్‌ఫోన్‌లు, కీబోర్డులు, గేమ్ కంట్రోలర్‌లు (గేమింగ్ కోసం) వంటి మ‌ల్టీ డివైజ్ ల‌కు అనుకూలంగా ఉంటుంది, ఇది భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా లివింగ్ రూమ్‌ను పూర్తి వినోద జోన్‌గా మార్చగలదు.

  • 300+ ఉచిత లైవ్ టీవీ ఛానెల్‌లు
  • 300+ జియోగేమ్స్
  • AI-ఆధారిత సిఫార్సులు
  • క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మరియు మరిన్నింటి కోసం అంకితమైన క్రీడా పేజీ.
  • విద్య, జీవనశైలి మరియు వినోదం కోసం 200+ కంటే ఎక్కువ పాపుల‌ర్‌ యాప్‌లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *