Tuesday, April 15Welcome to Vandebhaarath

Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కు బిగ్ షాక్..

Spread the love

ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Kejriwal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ప్రత్యేక  కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ , తదుపరి తేదీలో వారికి మరింత కస్టడీ అవసరమని కోర్టుకు తెలిపింది.

READ MORE  Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..

ఇడి తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు మాట్లాడుతూ, కస్టడీ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినాయకుడు “నాన్-కోపరేటివ్” గా ఉన్నారని అన్నారు.”అతను ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు పాస్‌వర్డ్‌లు ఇవ్వలేదు” అని రాజు కోర్టుకు వెల్లడించారు.

అయితే కోర్టులో ప్రవేశించే ముందు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ, “ప్రధానమంత్రి చేస్తున్నది దేశానికి మంచిది కాదు” అని అన్నారు.ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు.

READ MORE  Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

మరోవైపు, మనీలాండరింగ్ కేసులో ఇడి కస్టడీలో ఉన్నప్పుడు ఉత్తర్వులు జారీ చేయకుండా ముఖ్యమంత్రిని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *