Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Spread the love

Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.

రికార్డు స్థాయి పోలింగ్..

జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది.

అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024లో శ్రీనగర్‌లో 38.49% ఓటింగ్ జరిగింది, ఇది 2019లో 14.43% కంటే చాలా ఎక్కువ, బారాముల్లా 2019లో 34.6% నమోదు కాగా, ఈ సారి 59.10% న‌మోదైంది. అనంత్‌నాగ్-రజూరిలో 2019లో 34.6% పోలింగ్ శాతం న‌మోదు కాగా 2024లో 54.6%కి పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతనాగ్‌లో కేవలం 8.9% మంది మాత్రమే ఓటు వేశారు.

జమ్మూలో ఓటింగ్ సంఖ్య మెరుగ్గా ఉంది, అయితే ఇందులో సానుకూల పరిణామం ఏమిటంటే ఇది 2019లో కాశ్మీర్‌లో కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, బారాముల్లా తన 1996 రికార్డును 46.65% అధిగమించింది. పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు, ప్ర‌జ‌లు ఓటు వేయడానికి వచ్చారు, ఒకప్పుడు హింసాత్మకంగా ఉన్న లోయలో ఈ మార్పుతో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. అదేవిధంగా, శ్రీనగర్ ఇరవై ఆరేళ్లలో అత్యధిక ఓటింగ్ శాతాన్ని సాధించింది.

బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద పరిస్థితి మునుపటి కంటే చాలా భిన్నంగా ఉంది, ఒక చిన్న సమూహం ఓటర్లు జాగ్రత్తగా ఖాళీగా ఉన్న పోలింగ్ స్థలాలకు చేరుకుంటారు. సోపోర్‌లో 2019లో 4.3% పోలింగ్ శాతం న‌మోదు కాగా, ఈ సంవత్సరం 44.2% కి పెరిగింది. ఈ ప్రదేశం ప్రముఖ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ స్వస్థలం, జేఐకి బలమైన కంచుకోట‌గా చెబుతారు. అయితే తాజా ఓటింగ్ శాతం పెర‌గ‌డంతో బారాముల్లా ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)  కొనియాడారు.

ఇక‌ అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ స్థానం నలభై ఏళ్లలో అత్యధిక శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) పాండురంగ్ కుంద్‌బరావ్ శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అనంత్‌నాగ్-రాజౌరీలో 53% మంది ఓటర్లు ఓటు వేశారు, జమ్మూ కాశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు 58% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 40 ఏళ్లలో ఈ ఐదు స్థానాలకు ఇదే అత్యధిక ఓటింగ్‌ శాతం. మునుపటి గరిష్టం 2014లో 49% నమోదు కాగా, 1996లో 47.99% పోలింగ్ నమోదైంది.

అధికారుల ప్రకారం, సూరంకోట్, రాజౌరి, బుధాల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 68% పోలింగ్ నమోదైంది, 32% తో కుల్గామ్ అసెంబ్లీ సెగ్మెంట్ అత్యల్పంగా ఓటింగ్ న‌మోదైంది. ఎక్క‌డా కూడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదని, చాలావరకు ప్రశాంతంగా జరిగిందని ప్రధాన ఎన్నికల అధికారి పాండురంగ్ కుంద్‌బరావ్ తెలిపారు. అనంత్‌నాగ్, కుల్గాం, షోపియాన్, పూంచ్, రాజౌరి అనే ఐదు జిల్లాల మధ్య 18 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో కూడిన లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు జ‌రుగ‌గా, బిజ్‌బెహరాలో జరిగిన ఒక చిన్న సంఘటన మినహా ఎటువంటి ఇబ్బంది లేకుండానే పూర్త‌య్యాయి.

2022లో జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ సందర్భంగా దక్షిణ కాశ్మీర్ లోక్‌సభ స్థానం నుంచి పుల్వామా జిల్లా, షోపియాన్ అసెంబ్లీ సెక్టార్‌ను తీసివేయగా, పూంచ్, రాజౌరి నుంచి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు క‌లిపారు. అనంత్‌నాగ్‌-రాజౌరీ పోలింగ్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచారు, అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్ల‌డించింది.

అంతేకాకుండా, ఢిల్లీ, జమ్మూ, ఉధంపూర్‌లోని అనేక సహాయ శిబిరాల్లో నివసిస్తున్న కాశ్మీరీ వలస ఓటర్లకు మెయిల్ ద్వారా లేదా నిర్దేశిత పోలింగ్ ప్రదేశాలలో వ్యక్తిగతంగా ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఢిల్లీలో నాలుగు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు, ఉధంపూర్‌లో ఒకటి, జమ్మూలో ఇరవై ఒకటి ఉన్నాయి.

ఓటింగ్ శాతం పెర‌గ‌డానికి కార‌ణాలు..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత క‌శ్మీర్ (Jammu And Kashmir) లో ఇవి మొదటి ప్రధాన ఎన్నికలు, ప్రత్యేక హోదా పోయిన తర్వాత లోయలోకి అభివృద్ధి ప‌నులు వేగం పుంజుకున్నాయి. వేర్పాటువాదుల నేతృత్వంలోని బహిష్కరణ డిమాండ్లు, తీవ్రవాద భయాల కారణంగా చాలా కాలంగా ఓటు హక్కును వినియోగించుకోలేని పట్టణాలు గ్రామాల నుంచి ఓటర్లు బయటకు వచ్చారు. ఎన్నికలకు వ్యతిరేకంగా ఏ వేర్పాటువాద సంస్థ కూడా నిరసనకు పిలుపునివ్వకపోవడం గత ముప్పై ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇది కూడా ఓట్ల పెరుగుదలకు దోహదపడింది.

ఒకప్పుడు భారతదేశ వ్యతిరేక శక్తులతో నిండిపోయి ఉంది. అయితే న‌రేంద్ర‌ మోదీ ప్రభుత్వ విధానాల వల్ల లోయలో వేర్పాటువాదులు నిశ్చేష్టుల‌య‌య్యారు. ఆర్టికల్ 370 ర‌ద్దు (Article 370) తో కశ్మీర్ ఒక కొత్త పురోగతికి నాంది పలికింది. ఇప్పుడు, ఎటువంటి అడ్డంకి లేనందున, కాశ్మీర్ పూర్తి ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *