పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం

‘సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF

పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు.
“మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు” అని శర్మ చెప్పారు.

READ MORE  Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

“ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తాన్ నుంచి డ్రగ్ అసైన్‌మెంట్‌లు లేదా ఆయుధాలు వంటివి ఏదైనా సరిహద్దు దాటి ఇక్కడకు పంపవచ్చు” అని ఆయన అన్నారు.

కాగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలతో భారతదేశాన్ని ముంచెత్తడానికి పాకిస్తాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. డ్రోన్ సాంకేతికత తేలికైనది కావడంతో ముప్పు మరింత తీవ్రమవుతోందని ఒక నివేదిక తెలిపింది.
భారత్‌తో తన ప్రాక్సీ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ప్రస్తుతం పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాల చొరబాటుపై పాక్ ఈ ప్రక్రియపై దృష్టి సారించింది.

READ MORE  దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

భారతదేశ జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అటువంటి చర్యలో పాల్గొనడానికి పాకిస్తాన్ కు మానవులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. భారతదేశానికి, భారతదేశ పశ్చిమ ఫ్రంట్‌లో సిండికేట్‌లు, టెర్రరిస్ట్ గ్రూపుల అక్రమ రవాణా ద్వారా డ్రోన్‌ల వినియోగం పెరగడం కొత్త సవాలుగా మారిందని ఓ నివేదిక పేర్కొంది. ఈ కార్యకలాపానికి పాకిస్తాన్‌లోని సరిహద్దు రాష్ట్రాలు వేదికగా మారాయని తెలుస్తోంది.

Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను క్లిక్ చేయండి.. అలాగే తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న తాజా వార్తలు స్పెషల్ స్టోరీస్, ట్రెండింగ్ వీడియోల కోసం కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..  లేటెస్ట్ అప్డేట్స్ కోసం  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

READ MORE  Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *