National

Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ షాక్.. మరో 4 రోజులు కస్టడీ పొడిగింపు

Spread the love

Delhi liquor policy scam : న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు గ‌ట్టి షాక్ త‌గిలింది. మరో నాలుగు రోజులపాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించిన‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీపై పలు ప్రశ్నలు సంధించారు . గురువారం ఉదయం కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌‌కు అనుమతి లభించింది. ఈ సంద‌ర్బంగా ఈడీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ తనను, తన పార్టీని అణచివేయడానికి యత్నిస్తోందన్నారు.

ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించలేదని తెలిపారు. ‘నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిరూపించలేదు.. సీబీఐ 31 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈడీ 25 వేలపేజీలు దాఖలు చేసింది. వాటిని కలిపి చదివినా నన్ను ఎందుకు అరెస్టు చేశారనే ప్రశ్న మిగిలిపోయింది అని కేజ్రీవాల్‌ కోర్టులో వాదించారు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచినపుడు ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు సీఎం సతీమణి సునీత కేజ్రీవాల్ కోర్టులోనే ఉన్నారు.

కాగా దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగిస్తూ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. తన అరెస్ట్ కేవ‌లం ఒక రాజకీయ కుట్ర మాత్ర‌మేన‌ని, రాబోయే ఎన్నికల్లో దీనికి ప్రజలే గుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు. కేజ్రీవాల్‌ను (Kejriwal Arrest) మార్చి 21న అరెస్ట్ చేయగా, 28 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తనని అరెస్ట్ చేశాక.. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Delhi liquor policy scam కేసులో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. కొన్ని గంటల తర్వాత ఇడి అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ నేత నివాసంపై దాడి చేసి ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ త్వరగా అభ్యర్ధనను ఉపసంహరించుకున్నారు. కేజ్రీవాల్‌ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. ఆ కస్టడీ గడువు గురువారంతో ముగిసింది.
అదే సమయంలో, కేజ్రీవాల్ తన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు, దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరు తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని వాదించారు. కోర్టు వెంటనే చర్య తీసుకోవడానికి నిరాకరించింది . బదులుగా ఏప్రిల్ 2 లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసు జారీ చేసింది.

 

ఢిల్లీ హైకోర్టు విచారణ ఏప్రిల్ 3న తిరిగి ప్రారంభమవుతుంది. కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పిఐఎల్‌ను కూడా కోర్టు కొట్టివేసింది . తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది న్యాయపరమైన జోక్యం పరిధిలోకి రాద‌ని పేర్కొంది. ఈరోజు ఉదయమే కేజ్రీవాల్‌కు నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు అనుమతి లభించింది. ఈ క్ర‌మంలో కోర్టులో ఆయ‌న ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. తన పార్టీని “అణిచివేసేందుకు” దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించలేదని కూడా చెప్పారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *