
Explosives Seized| రాజస్థాన్లో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం!
న్యూ ఇయర్ వేడుకల వేళ పెను ప్రమాదం తప్పించిన టోంక్ పోలీసులుఢిల్లీ ఎర్రకోట పేలుడులో వాడిన పేలుడు పదార్థాలే ఇక్కడ కూడా గుర్తింపు.మారుతి సియాజ్ కారులో యూరియా బస్తాల మధ్య మృత్యు సామాగ్రి.బుండీ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్.. లోతైన విచారణ.జైపూర్ : నూతన సంవత్సర వేడుకల వేళ రాజస్థాన్లో పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి భారీ ముప్పును తప్పించారు. గత నెల నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర పేలుడులో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను టోంక్ పోలీసులు భారీగా స్వాధీనం (Explosives Seized) చేసుకున్నారు.టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) మృత్యుంజయ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. నిర్దిష్ట నిఘా సమాచారం అందిన వెంటనే జిల్లా ప్రత్యేక బృందం (DST) రంగంలోకి దిగింది. బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక మారుతి సియాజ్ కారును అడ్డగించి తనిఖీ ...








