Viral

Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

Spread the love

పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు.

ఇంతలో పోలీస్‌ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *