Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

Bangladesh Crisis |  బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

Bangladesh Crisis  | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
X లో ఒక పోస్ట్‌లో, PM మోదీ “ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్‌కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ ఇచ్చారు

READ MORE  Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

ఈ విష‌యాన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ X లో పోస్ట్ చేసారు, “ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, @ChiefAdviserGoB నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందూ సమాజంపై జ‌రుగుతున్న‌ దాడులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో యూనస్ నుంచి కాల్ వ‌చ్చింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం ప్రధాని మోదీ ఇంతకుముందు ప్ర‌శ్నించారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా యూనస్ “కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు” అభినందనలు తెలిపారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

READ MORE  Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

“పొరుగు దేశంగా, బంగ్లాదేశ్‌లో ఏమి జరిగినా ఆందోళన (Bangladesh Crisis)ను నేను అర్థం చేసుకోగలను. అక్కడి పరిస్థితి త్వరలో స‌ర్దుకుంటుంద‌ని ఆశిస్తున్నాను” అని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన అన్నారు. “ముఖ్యంగా, అక్కడ హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాల‌ని 140 కోట్ల మంది భారతీయులు కోరుతున్న‌ట్లు మోదీ పేర్కొన్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

READ MORE  Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *