Posted in

Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12 కోట్లకు పైగా విరాళాలు 

Ayodhya Pratishtha Dwadashi
Spread the love

Ayodhya Ram Mandir Updates : అయోధ్య రామమందిరంలో భక్తులు బాలరాముడికి  ఉదారంగా విరాళాలు ఇస్తూ తమ అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు.  జనవరి 23న ఆలయాన్ని ప్రజల కోసం తెరిచినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే రూ . 12 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తో విరాళాలు వచ్చిచేరుతున్నాయి.

జనవరి 23 న ప్రజలకు దర్శనభాగ్యం కల్పించినప్పటి నుండి, ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత పది రోజుల్లోనే రామ్ లల్లా (Ram lalla) కు దాదాపు 12 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం సందర్భంగా, ఎనిమిది వేల మంది హాజరయ్వారు. ఆ రోజున రూ. 3.17 కోట్లు విరాళంగా సేకరించబడ్డాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగడంతో అయోధ్యకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి రోజు, వందల వేల మంది ప్రజలు పూజలు, సందర్శనల కోసం వస్తారు.

గతేడాది 5.76 కోట్ల మంది సందర్శకులు

2023లో అయోధ్య సుమారు 5.76 కోట్ల మంది సందర్శకులను స్వాగతించింది. 2022తో పోలిస్తే సుమారు 3.36 కోట్ల మంది సందర్శకులు  కాశీకి వచ్చిన దానికంటే దాదాపు 1.42 కోట్ల మంది సందర్శకులు పెరిగారు.

రామ మందిర ప్రతిష్ఠాపనకు ముందు అయోధ్య సందర్శకుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఇప్పుడు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు నగరాన్ని సందర్శిస్తున్నారు. 2022లో, అయోధ్య 2,39,10,479 మంది పర్యాటకులను ఆకర్షించింది, అందులో 2,39,09,014 మంది దేశీయ సందర్శకులు, 1,465 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు.  అయితే 2023లో అయోధ్యకు 5,75,70,896 మంది సందర్శకులు వచ్చారు.

 11న బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ఎమ్మెల్యేలందరూ ఫిబ్రవరి 11న రామ్ లల్లాకు పూజలు చేయనున్నారు. వారితో పాటు అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, ఇతర NDA కూటమి భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు కూడా ఉంటారు.

సరస్వతీ పూజ

ఇదిలావుండగా, ఫిబ్రవరి 14న బసంత్ పంచమిని పురస్కరించుకొని రామాలయంలో భారీ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సరస్వతి పూజలతోపాటు  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. .

“ఆలయ వార్షిక పండుగ క్యాలెండర్‌ను ఖరారు చేయడంతో, భక్తులు ఏడాది పొడవునా మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు.  అందరికీ సుసంపన్నమైన అనుభవాలను అందిస్తుంది” అని రామ్ మందిర్ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *