Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు.

READ MORE  New Vande Bharat trains | అందుబాటులోకి మరో 10 వందేభారత్ రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఈ ఉగ్రవాద సంస్థ ఇలాంటి బెదిరింపులు చేసింది. రామ మందిరాన్ని నిర్మించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం దాని భద్రతకు సంబంధించి కొత్త ఏర్పాట్ల కోసం నిరంతరం కసరత్తు చేస్తోంది. అయోధ్యలో NSG కేంద్రాన్ని కూడా ప్రతిపాదించింది.

READ MORE  ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్

అయితే రామాలయానికి తీవ్రవాద సంస్థ నుంచి ఎలాంటి ముప్పు పొంచివుందో తెలియదని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. అలాంటి ఆడియో గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయోధ్య ధామ్ వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ నయ్యర్ మీడియాకు తెలిపారు. సీనియర్ గెజిటెడ్ అధికారుల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి వివిధ జోన్ల వారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. జిల్లా పోలీసులతో పాటు పలు పీఏసీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు.

READ MORE  Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12 కోట్లకు పైగా విరాళాలు 

సీసీ కెమెరాల ద్వారా ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా రియ‌ల్ టైం ఇన్‌పుట్‌లను వెంటనే కంట్రోల్ రూమ్ నుండి గ్రౌండ్‌లోని సిబ్బందికి స‌మాచారం అందుతుంది. అదే సమయంలో, రామజన్మభూమి కాంప్లెక్స్‌లో మోహరించిన అధికారులు, భద్రతా సిబ్బందిని హై అలర్ట్ చేశారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *