Thursday, June 19Thank you for visiting

ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

Spread the love

Secunderabad Railway Station : హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరించిన స్టేషన్, ప్రస్తుతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. అయితే ఈ స్టేష‌న్‌ వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.

ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్లాట్ ఫాంపై నిలిచి బ‌య‌లుదేరేముందు మాత్ర‌మే ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమ‌తించ‌నున్నారు. దీనివ‌ల్ల ప్లాట్ ఫాంపై ప్ర‌యాణికులు కిక్కిరిసిపోయే ప‌రిస్థితి ఉండ‌దు.

భోపాల్ స్టేష‌న్ త‌ర్వాత‌..

రూ.700 కోట్ల భారీ వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి మోడ్ర‌న్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పటిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన ఎయిర్‌పోర్ట్ తరహా కాంప్లెక్స్‌గా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ (Bhopal) లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ (Rani Kamalapati railway station) దేశంలోనే మొట్ట‌మొద‌టి ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా నిలిచింది. కానీ, అక్కడ భారీ ఖర్చుతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

1, 10 ప్లాట్‌ఫాంల‌పై భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మిషన్ సిస్టమ్‌

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ నెం.1 వైపు అలాగే ప్లాట్‌ఫారమ్ నెం.10, భోయిగూడ వైపు నుంచి ప్ర‌యాణికుల కోసం ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. రూ.3 కోట్లతో ఈ రెండు మార్గాల్లో ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మిషన్ సిస్టమ్‌తో ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండూ కొనసాగుతాయి.

ఈ అధునాత‌న‌ స్క్రీనింగ్ సిస్టం (Baggage Screening Machine System) ద్వారా ప్రయాణికులు తమ ల‌గేజ్ ల‌ను త‌నిఖీ చేస్తారు. ఇందుకోసం రైలు బయలుదేరే సమయం కంటే కాస్త ముందుగానే ప్ర‌యాణికులు స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రస్తుతం స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకుంటున్నారు. కానీ, త్వ‌ర‌లో స్టేషన్‌లో ఇది సాధ్యం కాదు. టిక్కెట్ పొందిన తర్వాత, ప్రయాణికులు కాన్‌కోర్స్ ద్వారా ప్యాసింజర్ వెయిటింగ్ హాల్‌కు వెళ్లాలి. అక్కడే కూర్చోవాలి లేదా షాపింగ్ చేయాలి.

రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రావడానికి 15 నిమిషాల ముందు ఒక ప్రకటన చేస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌పైకి రావాల్సి ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకుపోవడం స్టేషన్‌లలో స‌ర్వ‌సాధాన‌మైపోయింది. అయితే, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత, బ్యాగేజీ తనిఖీ తప్పనిసరి కాబట్టి అలాంటి ప్రయాణికులను అనుమతించకూడదని అధికారులు యోచిస్తున్నారు.

చాలా సార్లు బిచ్చగాళ్ళు, విచ్చలవిడిగా రైల్వే స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించడం, రాత్రి స‌మ‌యంలో నిద్రించడానికి ప్లాట్‌ఫారాల‌ను ఆక్రమించడం కనిపిస్తుంటుంది. కానీ ఇక నుంచి ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వారిని స్టేష‌న్‌లోకి అనుమ‌తించ‌రు.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే (SCR)లో కేవలం మూడు స్టేషన్లు మాత్రమే ప్రపంచ స్థాయి స్టేషన్లుగా సిద్ధమవుతున్నాయి. అందులో తిరుపతి, నెల్లూరు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) మాత్రమే ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..