World

Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

Spread the love

Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది.

గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు..

అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే   ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత పాటించలేదని, షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక మౌలిక సదుపాయాల ఒప్పందాలను ఆయన విమర్శించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, మహ్మద్ యూనస్ ప్రభుత్వం సుమారు $500 మిలియన్ల బకాయిలను చెల్లించేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహించిన అదానీ గ్రూప్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

800 మిలియన్ డాలర్ల బకాయిలు

భారీగా పేరుకుపోయిన అప్పులతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు అతిపెద్ద అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  అదానీ గ్రూప్ (Adani Group) ప్రకారం, వారు నిరంతరం తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.  మేము ప్రతి పరిస్థితి గురించి వారికి తెలియజేశాం. బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ, పెండింగ్ చెల్లింపులు ఆందోళనలకు దారితీస్తున్నాయి. రెండు పార్టీలకు వారి స్వంత బాధ్యతలు ఉన్నాయి. అవి నెరవేరకపోతే సమస్యలు తలెత్తుతాయి. బంగ్లాదేశ్ బకాయి విద్యుత్ బిల్లు ఒక్కటే 3.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. ఇందులో దాదాపు $492 మిలియన్లు అదానీ గ్రూప్‌కు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇతర వస్తువులతో పాటు అదానీ గ్రూప్‌కు దాదాపు 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *