Trending NewsNational

Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..

Spread the love

Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది.

Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే..

ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest train) గా దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) గుర్తింపు పొందింది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్‌ను తమిళనాడులోని కన్యాకుమారికి కలుపుతుంది. మొత్తం 4,189 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 75 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. 57 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.

Super Vasuki : సూపర్ వాసుకి రైలు గురించి తెలుసా?

ఇండియన్ రైల్వే (Indian Railway) ఆగస్టు 2022లో ‘సూపర్ వాసుకి’ని ప్రవేశపెట్టాయి. సూపర్ వాసుకి దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలు. దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవున్న సూపర్ వాసుకి (Super Vasuki Train) లో ఆరు ఇంజన్లు, 295 వ్యాగన్లు ఉంటాయి. ఈ భారీ రైలు దాదాపు 25,962 టన్నుల సరుకును రవాణా చేయగలదు. ఇది దేశవ్యాప్తంగా బల్క్ గూడ్స్ రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ రైలులో వస్తువులను, ముఖ్యంగా బొగ్గును విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయడానికి నడుస్తుంది.

సూపర్ వాసుకి ప్రయాణం ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా నుంచి ప్రారంభమై నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు వెళుతుంది. ఈ ప్రయాణం పూర్తి కావడానికి దాదాపు 11 నుండి 20 గంటలు పడుతుంది. ఈ రైలు కదులుతున్నప్పుడు, దాని కూత చాలా దూరం నుండి వినబడుతుంది. రైలు ప్రయాణిస్తున్న దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *