Tuesday, February 17"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

Spread the love

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) ‘వోకల్ ఫర్ లోకల్’  (Vocal for Local ) ప్రచారానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మ‌య్యారు. వినియోగ‌దారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువ‌చ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారు. వ్యాపార‌, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇది ప్రతిగా చైనాకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది దాదాపు 1.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

పిఎం మోడీ ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం. దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్ర‌ధాన ల‌క్ష్యం. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను కొనుగోలు చేయాల‌ని ప్రధానమంత్రి త‌ర‌చుగా చెబుతుంటారు. దీంతో భారతీయులు స్థానిక వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత అవగాహన కలిగి ఉన్నవారు దేశీయ ఉత్పత్తుల కోసం చురుకుగా వెతుకుతున్నారు.

చైనా ప్రభావం ఎలా ఉంది

ఈ ఏడాది దీపావళి సందర్భంగా వినియోగదారులు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున, చైనా తన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం వల్ల భారీగా నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఈ దీపావళి సీజన్‌లో చైనా వ్యాపారంలో దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు (సుమారు 17.5 బిలియన్ డాలర్లు) నష్టపోయే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

భారతీయులు మట్టి దియాలు (మట్టి దీపాలు), అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి దేశీయ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. దీపావళి నాటికి దేశీయ విక్రయాలు రూ. 1 లక్ష కోట్లు (సుమారు 14 బిలియన్ డాలర్లు) దాటవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయ ఉత్పత్తుల వైపు ఈ మార్పు భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. ఇది స్థానికంగా కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వినియోగదారులలో పెరుగుతున్న అవగాహనను, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్న‌ట్లు సూచిస్తుంది. ఈ ట్రెండ్ దీపావళి తర్వాత కూడా కొనసాగుతుందని. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

ధన్‌తేరాస్ వ్యాపారం రూ. 60,000 కోట్లు!

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వ్యాపారులకు విజ్ఞప్తి చేసింది. చాందినీ చౌక్‌కు చెందిన వ్యాపారి ఒకరు మాట్లాడుతూ, దాదాపు అన్ని కొనుగోళ్లు భారతీయ వస్తువుల కోసం జరుగుతున్నందున ‘వోకల్ ఫర్ లోకల్’ అనే తత్వం మార్కెట్‌లలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దీపావళికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తున్న తమ ప్రాంతంలోని మహిళలు, కుమ్మరులు, కళాకారులు, ఇతరుల అమ్మకాలను పెంచడంలో సహాయం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య సంస్థలను CAT కోరింది. దీంతో ప్రజల్లో అవగాహన పెరిగి ఇప్పుడు దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల చైనాకు దాదాపు రూ.1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) ప్రకారం, ఈ సంవత్సరం, ధన్‌తేరస్‌పై దాదాపు 60 వేల కోట్ల రూపాయల వ్యాపారం అంచనా వేసింది. దీపావళి నాటికి ఈ సంఖ్య లక్ష కోట్ల రూపాయలను దాటుతుంది. ఈ సమయంలో బంగారం, వెండితో పాటు ఇత్తడి పాత్రలను కూడా భారీగా కొనుగోలు చేశారు. ఈసారి దాదాపు రూ.2500 కోట్ల విలువైన వెండి కొనుగోలు చేశారు. ఒక్కరోజులోనే 20 వేల కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *