Posted in

Vikrant Massey | విక్రాంత్ మాస్సే.. 37 ఏళ్ళ వయసులో నటనకు రిటైర్మెంట్, అభిమానులను షాక్‌..

Spread the love

Vikrant Massey announces retirement : ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్‌లో ఉన్న విక్రాంత్ మాస్సే తన తాజా విడుదలైన ‘ది సబర్మతి రిపోర్ట్’ విజయంతో దూసుకుపోతున్నాడు, ఇది బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడింది. దీనికి ముందు, 12వ ఫెయిల్, సెక్టార్ 36లో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

అయితే, కేవలం 37 ఏళ్ల వయస్సులో, విక్రాంత్ నటనకు దూరంగా ఉండాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.సోమవారం ఉదయం, నటుడు. ఒక ఎమోషనల్ సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నాడు. అతను ఇలా వ్రాశాడు,

“గడిచిన కొన్ని సంవత్సరాలు  ఎంతో అసాధారణమైనవి. మీ చెరగని ప్రేమ, అభిమానాలు అందించిన  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ  భర్తగా, తండ్రిగా & కొడుకుగా నా కుటుంబానికి  సమయం కేటాయించడానికి ఆసన్నమైందని నేను గ్రహించాను.

విక్రాంత్ ప్రస్తుతం ‘యార్ జిగ్రీ’ మరియు ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’ అనే రెండు చిత్రాలను పూర్తి చేస్తున్నాడు. తన మిగిలిన ప్రాజెక్ట్‌లు “2025 లో పూర్తవుతాయి.   మరోసారి అందరికి ధన్యవాదాలు, “ఎప్పటికీ రుణపడి ఉంటాడు” అని పోస్ట్ చేశారు.

 

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *