Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Vande Bharat : త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు | ఢిల్లీ–పాట్నా మార్గం ప్రారంభం.. పంజాబ్‌లో కొత్త రైల్వే లైన్

Spread the love
  • అక్టోబర్ 15 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం
  • ఢిల్లీ–పాట్నా మార్గంలో రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభం
  • పంజాబ్‌లో రాజ్‌పుర–మోహాలి మధ్య కొత్త రైల్వే లైన్
  • ఫిరోజ్‌పూర్–భటిండా–పాటియాలా–ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • పంజాబ్ రైల్వే పెట్టుబడుల్లో అపూర్వ వృద్ధి

న్యూఢిల్లీ: త్వ‌ర‌లో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper Express) రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ రైలు అభివృద్ధి చివరి దశలో ఉందని, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
అధికారుల ప్రకారం, ఒక రైలు ఇప్పటికే అవసరమైన పరీక్షలన్నింటిని నిర్వ‌హించారు. దిల్లీలోని షకుర్ బస్తీ డిపోలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

Highlights

“రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ సర్వీసులను నిర్వహించడానికి రెండవ రైలు అవసరం. అందుకే మేము రెండో రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. అది మాకు అందిన తర్వాత, మేము మార్గాన్ని నిర్ణయించుకుని కార్యకలాపాలను ప్రారంభిస్తాము,” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ అన్నారు.

బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, పాట్నా మధ్య ఈ సేవ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు పిటిఐ తెలిపింది. పంజాబ్‌లో వందే భారత్ (Vande Bharat express), కొత్త రైల్వే లైన్ ప్రకటన
మంగళవారం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు పంజాబ్‌లోని రాజ్‌పుర, మొహాలి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రకటించారు.

అదనంగా, ఫిరోజ్‌పూర్ కాంట్-భటిండా-పాటియాలా-ఢిల్లీ మార్గంలో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలనే ప్రతిపాదనను వారు వెల్లడించారు. ఈ రైలు 486 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ రైలు బుధవారం తప్ప వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

పంజాబ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను పెంచడానికి భారీ పెట్టుబడి పెడుతున్న‌ట్లు వైష్ణవ్ ప్రక‌టించారు.
ఈ ప్రాజెక్టులు స్థానికంగా కనెక్టివిటీని పెంచుతాయని, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు.

పంజాబ్ రైల్వే రంగంలో పెట్టుబడులు అపూర్వమైన వృద్ధిని సాధించాయని వైష్ణవ్ పేర్కొన్నారు. 2009, 2014 మధ్య పెట్టుబడి కేవలం రూ. 225 కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు అది రూ. 5,421 కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు.ఈ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు కృషికి ఈ విజయాన్ని ఆయన అభినందిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *