Andhrapradesh

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

Spread the love

విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..

TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. సుమారు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే వీరి కోసం తొలుత TSRTC E-Buses ను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

బస్సులు బయలుదేరే సమయాలు..

  • మియాపూర్ నుంచి : ఉదయం 6:25, ఉదయం 8:25, ఉదయం 10:25, సాయంత్రం 6:05, రాత్రి 7:45, రాత్రి 9:45 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
  • MGBS నుంచి : ఉదయం 8:10, ఉదయం 10:10, మధ్యాహ్నం 12:10, రాత్రి 7:50, రాత్రి 9:30, రాత్రి 11:30 గంటలకు ఈ-గరుడ బస్సులు స్టార్టవుతాయి
  • విజయజవాడ నుంచి : ఉదయం 6:20, ఉదయం 8:00, ఉదయం 10:00, సాయంత్రం 6:40, రాత్రి 8:40, రాత్రి 10:40 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి. 

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *