Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Yogi Model | యూపీలో ఆగని నేరస్థుల వేట ఏడేళ్లలో 7వేల మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్టు..

Yogi Model | యూపీలో ఆగని నేరస్థుల వేట ఏడేళ్లలో 7వేల మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్టు..

Trending News
Yogi Model | ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) క్రిమినల్స్ ఆటకట్టించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. గురువారం బహ్రైచ్ హింసాకాండలో పాల్గొన్న ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ హడా బసేహరి ప్రాంతంలో జరిగింది, ఇది నాన్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది భారత్ , నేపాల్ సరిహద్దు నుండి 15 కి.మీ దూరంలో ఉంది.యూపీ పోలీసు బలగాలకు ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు ఇదే మొదటిసారి కాదు . అధికారం చేపట్టినప్పటి నుంచి, యోగీ ప్రభుత్వం మాఫియాలు, గ్యాంగ్‌స్టర్ల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. నేరాలను అరికట్టడానికి కఠినమైన చర్యలను అమలు చేసింది. నేరస్థులను లక్ష్యంగా చేసుకోవడం, వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్‌లను బుల్‌డోజింగ్ చేయడం ద్వారా, యోగి మోడల్ దేశంలోనే పాపులర్ అయింది. పౌరుల భద్రతపై విశ్వాసాన్ని ...
How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

Trending News
How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువుల‌తో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవ‌డం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది క‌న్ఫార్మ్‌ రైలు టిక్కెట్‌ను దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటిక‌ప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. ఇక హైదరాబాద్ నుంచి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే రైళ్ల పరిస్థితి అత్యంత‌ దారుణంగా ఉంటుంది. తత్కాల్‌లో సీటు వస్తుందో రాదో న‌మ్మ‌కంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇదే కరెంట్ టికెట్ ఆప్ష‌న్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయమేమిటంటే రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత మీరు కరెంట్ టిక్కెట్‌ను బుక్ చేసుకుని ప్రయాణించవచ్...
హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

Trending News
Durga Devi Mandir attack | హైదరాబాద్‌ ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్‌ ‌పోలీసులు  కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని వ...
రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?

రతన్ టాటా సామ్రాజ్యానికి ఆ ముగ్గురిలో వారసుడు ఎవ‌రు?

Trending News
Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. దేశంలోని అత్యంత గౌరవనీయమైన ది వ్యాపారవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా తన చేపట్టిన అనేక దాత్రుత్వ కార్యక్రమాలతో ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన మరణం తర్వాత‌ ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది.రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ. వీరు 1940లో విడాకులు తీసుకున్నారు. దీంతో నావల్ టాటా 1955లో స్వీస్ మహిళ సిమోన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. నోయెల్ టాటాకు మాయ టాటా, నెవిల్లే టాటా, లియా టాటా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం టాటా గ్రూపు వ్యాపారాల్లో ఉ...
రతన్ టాటా చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదే… కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు

రతన్ టాటా చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదే… కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు

Trending News
Ratan Tata Death | భారతదేశ అత్యంత ప్రియమైన పారిశ్రామికవేత్తలు, మాన‌వ‌తావాది అయిన ర‌త‌న్ టాటా 86వ ఏట తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాపార దిగ్గజం మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటనను పంచుకున్నారు. ఈ వార్తల మధ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ చూసి ఆయ‌న అభిమానులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు.Ratan Tata's final Instagram post : కేవలం రెండు రోజుల క్రితం, సోమవారం, ర‌త‌న్‌ టాటా సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆరోగ్యం గురించి వ్యాపించే పుకార్ల గురించి ప్ర‌స్తావిచారు. తన సందేశంతో "నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు."నా ఆరోగ్యం గురించి ఇటీవలి పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఈ వార్త‌లు నిరాధారమైనవని అందరికీ తెల‌పానుకుంటున్నాను. నా వయస్సు సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను...
Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Trending News
Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సంద‌ర్భంగా భార‌తీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్‌ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సికింద్రాబాద్‌, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొంద‌వ‌చ్చని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున‌ట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఆర్‌సీటీసీ యాప్‌, ఈ-క్యాటరింగ్‌ వెబ్‌సైట్‌ నుంచి ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.Navratri Special Meal : నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి లభించే కొన్ని ముఖ్య...
Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ

Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ

Trending News
Nitin Gadkari - Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట  బేబీ కేర్‌ రూమ్స్‌, క్లీన్‌ టాయిలెట్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్రాంతాలు,  ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన  ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతు...
Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమ‌లు దిశ‌గా ఉత్తరఖండ్..

Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమ‌లు దిశ‌గా ఉత్తరఖండ్..

Trending News
Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధ‌మ‌వుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవ‌లే విస్తృత చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించింది. అనంత‌రం క‌మిటీ త‌న‌ సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ 9 నాటికి రాష్ట్ర 24వ ఆవిర్భావ దినోత్సవంతో యుసిసిని అమలు చేయనున్న‌ట్లు గ‌త‌లోనే ప్రకటించారు.ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో యూసీసీ (Uniform Civil Code) బిల్లును ఆమోదించింది. రాష్టప‌తి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు, UCCని అమలులోకి తెచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి మార్గం సుగమం చేసింది.ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ ...
Stone Pelting Incident |  భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Trending News
Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. ...
ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

Trending News
Secunderabad Railway Station : హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరించిన స్టేషన్, ప్రస్తుతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. అయితే ఈ స్టేష‌న్‌ వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్లాట్ ఫాంపై నిలిచి బ‌య‌లుదేరేముందు మాత్ర‌మే ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమ‌తించ‌నున్నారు. దీనివ‌ల్ల ప్లాట్ ఫాంపై ప్ర‌యాణికులు కిక్కిరిసిపోయే ప‌రిస్థితి ఉండ‌దు. భోపాల్ స్టేష‌న్ త‌ర్వాత‌.. రూ.700 కోట్ల భారీ వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి మోడ్ర‌న్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పటిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన ఎయ...