Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: vikarabad

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

Telangana
రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (N.Ramchandar Rao) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి (Ananthagiri) జిల్లా”గా మారుస్తామని స్పష్టం చేశారు. అనంతగిరి పర్యాటక కేంద్రంగా దక్షిణ ఊటీగా ప్రసిద్ధి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు? బీసీలకు ఇప్పటికే బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.యూరియా సరఫరాపై అసత్య ప్రచారం.....
Vikarabad |  సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

Vikarabad | సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

Telangana
Farmers Attack On Vikarabad Collector | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా  మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్‌ లగచర్ల గ్రామానికి చర్చల కోసం బయలుదేరారు.కలెక్టర్‌ గ్రామంలోకి  రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లను విసిరారు. కారు దిగి రైతులతో చర్చించి ఒప్పించేందుకు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ప్రయత్నించారు. ఈ...
New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Telangana
Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు. గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు.. ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to...