
లోక్సభలో ‘జీ-రామ్-జీ’ (VB-GRAM-G) బిల్లు ఆమోదం: సభలో ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులు తీసుకువచ్చే ‘విక్షిత్ భారత్ - రోజ్గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్)’ - (VB-GRAM-G) బిల్లు, 2025 కు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే క్రమంలో దిగువ సభ రణరంగంగా మారింది. మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాపీలను చింపి స్పీకర్ పోడియం వైపు విసిరేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై రగడగతంలో ఉన్న MGNREGA (ఉపాధి హామీ పథకం) స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాదన: గాంధీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని, ఈ కొత్త బిల్లు వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం...
