వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతం
Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్లో కొత్తగా నిర్మించిన 16-కోచ్ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్ను కోట - మహిద్పూర్ రోడ్ స్టేషన్ల మధ్య 'అప్' దిశలో అలాగే మహిద్పూర్ రోడ్ - షామ్ఘర్ స్టేషన్ల మధ్య 'డౌన్' లైన్లో పరీక్షించారు.కోటా డివిజన్కు చెందిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రోహిత్ మాల్వియా మాట్లాడుతూ.., వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ట్రయల్ నిర్వహించామని, ఒక్కో కోచ్లో ప్రయాణీకుల బరువుకు సమానంగా మొత్తం 24.7 టన్నులు లోడ్ చేశామని వివరించారు. "ట్రయల్ సమయంలో రైలు గరిష్టంగా 145 km/h వేగంత...