
Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
TS Cabinet Meet | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 4 గంటలపాటు పలు ముఖ్యమైన అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై రూ.500 బోనస్ (Rs 500 Bonus ) చెల్లించాలని, అలాగే ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, కొనుగోలు ప్రక్రియ సులభతరంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తడిసిన ధాన్యం కొనుగోలు
కేబినెట్ సమావేశం అనంతరం పూర్తి వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా...