Thursday, June 19Thank you for visiting

Tag: telangana elections

KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

Telangana
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు.ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్‌, హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్య...
మీకు “ఓటర్​ స్లిప్​” ఇంకా అందలేదా?    సింపుల్​గా ఇలా పొందండి..!

మీకు “ఓటర్​ స్లిప్​” ఇంకా అందలేదా? సింపుల్​గా ఇలా పొందండి..!

Telangana
తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్​ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్​ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip)​ అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్​ స్లిప్​ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. ఓటర్ స్లిప్ తో  లాభం ఇదే.. మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ ఓటరు స్లిప్ ఎందుకు? అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో సుమారు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలుంటుంది. ఆ పో లింగ్ కేంద్రం ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన వద్ద ఉండాలి. ఓటు వేయడానికి మనం వెళ్లినప్పుడు.. ఓటరు ఐడీ కార్డు లేదా.. వేరే ఇతర గుర్తింపు కార్డు తో పాటు.. ఈ స్లిప్ తీసుకెళ్తే.. త్వరగా ఓటు వేసేయవచ్చు. ...
రాజ్ నీతి ఒపీనియన్‌ పోల్‌.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

రాజ్ నీతి ఒపీనియన్‌ పోల్‌.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Telangana
తెలంగాణలో బీఆర్ఎస్‌(BRS) హాట్రిక్‌ పక్కా..హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్‌ జైత్రయాత్ర ఈసారి కూడా కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) నాయకత్వానికే జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆరే పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్‌ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్‌ టీవీ తదితర సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా, రాజ్ నీతి సర్వేలో (Rajneethi Opinion Poll) బీఆర్ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడయింది. బీఆర్ఎస్‌ పార్టీకి 77 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఉచితాలు ఇస్తామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్‌ కేవలం 29 స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ ఆరు సీట్లతో మరోసారి సింగిల్‌ డిజిట్ వరకే పరిమితమవనుంది. ఇక బీఎస్పీ అస...
కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే…

కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే…

Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తలలు పండిన రాజకీయవేత్తలతోపాటు యువ నాయకులు బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు ఎవరో ఒక సారి తెలుసుకుందాం.రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన నేతలు 45 మందికి పైగా ఉన్నారు.ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018).కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి (Jana Reddy) , బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ (Etala rajender) ఇద్దరూ ఏడుసార్లు విజయం సాధించారు.జానా రెడ్డి 1983, 1985లో టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు.ఈటల రాజేందర్ (Etela Rajender) 2004, 2008 (By Poll), 2009...
BRS Manifesto |  బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

BRS Manifesto | బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

Telangana
BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు ఇవీ.. రైతుబంధు 16 వేలకు పెంపు తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఏడాది రూ.12వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత ప్రతీ సంవత...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..