Nitin Gadkari : తెలంగాణలో రూ.2 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే మూడు-నాలుగు సంవత్సరాలలో రూ.2 లక్షల కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టు (Telangana state highways)లను చేపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం వెల్లడించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్లకు పైగా విలువైన అనేక రోడ్డు ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు గత 10 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా 5,000 కి.మీ.కు చేరుకుందని అన్నారు.33 జిల్లాల్లో కొనసాగుతున్న పనులు"తెలంగాణలోని 33 జిల్లాల్లో రోడ్డు పనులు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి....