First Bullet Train | భారత్ లో మొదటి బులెట్ రైలుపై కీలక ప్రకటన
Indias First Bullet Train | దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు (Bullet Train)కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’ (Rising Bharat Summit) లో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడిపించనున్నట్లు ప్రకటించారు. 2028 వరకు ముంబై – అహ్మదాబాద్ మార్గం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు.కాగా భారతీయ రైల్వే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని ...