PV Narasimha Rao | మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
PV Narasimha Rao | హైదరాబాద్ : భారత దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహ రావుకు భారతరత్న ప్రకటించడంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఎక్స్ వేదికగా కేసీఆర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర : ప్రధాని మోదీ
PM Modi | దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ .. సోషల్ మీడ...